మహిళా డాక్టర్ పై గ్యాంగ్ రేప్, హత్యకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన

శనిగరపు రమేష్ బాహుబలం ప్రతినిధి కమలాపూర్

ఆగస్టు 17:ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో మహిళా వైద్యురాలి పై సామూహిక హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించారు.ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చట్టాలు,భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ… పోస్ట్మార్టం నివేదికలో బాధితురాలి జననేంద్రియ ప్రాంతంలో 151 గ్రాముల వీర్యం,90 డిగ్రీలో కాళ్ళు ముడుచుకున్నట్లు తేలిందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల భద్రతకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి వద్ద రాత్రిపూట భద్రతను పెంచాలని,ఈ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలను అరికట్టాలని వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ నరేష్, పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ వరుణ్,హెడ్ నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి,రేడియోగ్రాఫర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ అమృత, ఫార్మసిస్టు సుశ్రిత, నర్సింగ్ ఆఫీసర్లు శాంత, ప్రమీల, సరిత, సునీత,అనిత, సమీరా, సంపూర్ణ, మేల్ నర్సింగ్ ఆఫీసర్ సుమన్,ల్యాబ్ టెక్నిషియన్ చంద్రమౌళి, శానిటేషన్ సూపర్వైజర్ పవన్ కళ్యాణ్, సిబ్బంది కవిత, వనజ, రమ, రిపిక, సుధాకర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….