ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్ట్15:
పివి సేవా సమితి & అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించి జెండావందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం పీవీ సేవ సమితి అద్యక్షులు తూము వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మహానుభావుల త్యాగఫలం, నిస్వార్థ ఉద్యమాల ఫలితమే నేటి స్వతంత్ర ఫలమని అన్నారు. ప్రతి వ్యక్తి దేశ భక్తి కలిగి ఉండాలని,సమరయోధుల ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు B. మనోజ్, Dr. రామలింగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ సంపత్ రెడ్డి, పిడి రాజిరెడ్డి, మాజి సర్పంచులు జనార్దన్ రెడ్డి పంజాల సుధాకర్, ముక్కేర కన్నయ్య, రావుల తిరుపతి రెడ్డి వేల్పుల ప్రభాకర్, గౌరి శంకర్, పసుల స్వామీ, సాగి శివప్రసాద్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !