ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు

బాహుబలం న్యూస్ హుజురాబాద్.ఆగస్టు 09
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శుక్రవారం హుజురా బాద్ పట్టణంలోని గణేష్ నగర్ లో ఆదివాసి తోటి (బర్డు గోండ్) సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్స వం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సం ఘం జిల్లా అధ్యక్షుడు షి షెడమాకి బిక్షపతి ఆదివాసి ఆరాధ్యుడైన కొమురంభీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ సమాజంలో అట్టడుగు వర్గాలైన ఆదివాసీల జీవన స్థితిగతులు వేటికీ మారలేదని అన్నారు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన తాము సామాజికంగా రాజకీయం గా కూడా పూర్తిగా చివరి స్థాయిలో ఉన్నామని అన్నారు తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం లభించ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని తమకు కేటాయిం చలేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసీల ఆకాంక్షలు తీర్చాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆత్రం శోభన్ ఆత్రం సదానందం గీయడం అశోక్ సోయం సమ్మయ్య సురేష్ శ్రీనివాస్ గుర్రాల గిరి బాబు అజయ్ సతీష్ అశోక్ షేడమాకి ప్రతాప్ రాజేష్ వినీల్ కృపాకర్ గడ్డం జయ,శడమాకి సబిత,ఆత్రం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !