బాహుబలం న్యూస్ సైదాపూర్ ఆగస్ట్ 09:కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లిలో స్వచ్ఛదనం – పచ్చద నం ఐదు రోజుల ముగింపు సందర్భంగా శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,గ్రామ కార్యదర్శి, ఆరోగ్యశాఖ వారు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రపరచి,నిలువ ఉన్న నీటిని తొలగించా రు. అనంతరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల దొంత శ్రీనివాస్ అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛదనం-పచ్చదనంఫై అవగాహన కల్పిం చారు. అనంతరం పెరకపల్లే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ ఉమ్మ డి గ్రామ పంచా యతీ పరిధిలోని పెరుకపల్లి ఉన్నత పాఠ శాల,ప్రాథమిక పాఠశాల,గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల, గొల్లగూడెం అంగన్వాడి పాఠశాల, శివరాంపల్లి, సర్వాయి పేట,ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్, పె న్నులు బహుకరించారు.పాఠశాల పదవ తరగతి విద్యా ర్థులకు,ఆయా పాఠశాలలకు డిక్షనరుల ను పంపిణీ చేశా రు.ఈ కార్యక్రమంలో అమ్మ కమిటీ అధ్యక్షు రాలు లక్కర్స్ పద్మ,గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఏఎన్ ఎమ్ వరంద,తాజా మాజీ సర్పంచ్ బత్తుల కొమురయ్య, గొల్ల గూడెం గ్రామపంచాయతీ మురళి,తాజా మాజీ ఉప సర్పంచ్ పోతరాజు శ్రీనివాస్,బోళ్ల శంకరయ్య,బుచ్చయ్య, పోతరాజు శ్రీనివాసులు,పోతరాజు ఈశ్వరయ్య, జక్కోజు బుచ్చయ్య,ఉపాధ్యాయులు అంజయ్య,ప్రాథమిక పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి,హై స్కూల్ ఉపా ధ్యాయు లు గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొ న్నారు.













