రక్తదానం చేయండి-ప్రాణ దాతలు అవండి.. టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి

సబ్బనీ వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి కరీంనగర్
ఆగస్టు 09:శుక్రవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బద్దీపడిగే మానస భర్త బద్దీపడిగే శ్రీనివాస్ రెడ్డి సముద్రలింగపూర్ నివాసి అనే మహిళకు అత్యవసరంగా ఏ పాజిటివ్ (A+) రక్తం అవసరం ఉన్నదని తెలియగానే టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి రక్తదానం ( 27 వ సారి ) చేయడం జరిగింది.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడటానికి యువత ముందుకు రావాలని ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి 3 నెలల కొకసారి రక్తాన్ని ఇవ్వొచ్చన్నారు.తలసేమియా చిన్నారులకు రక్త నిల్వలు లేక ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు. యువతలో మార్పు వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరే మల్లేశం,తుమ్మనపెళ్లి శ్రీనివాస్,బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి రవి తదితరులు ఉన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !