బాహు బలం న్యూస్
హుజురాబాద్,జులై 30 జనతా న్యూస్: వారం రోజుల క్రితం నాగార్జున పాల డైరీ చైర్మన్ పుల్లూరి ప్రభాకర్ రావుకు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తన అనుచరుడినని, రూ. 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరో పోలీసులు విచారణ చేసి తేల్చాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు పోలీసులకు విజ్ఞప్తి చేసారు. మంగళవారం అయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభాకర్ రావు ఆరోపణలు ఖండించారు. ఇది ప్రభాకర్ రావు ఆడుతున్న నాటకమని మండిపడ్డారు
గతంలో కూడా ఈటల రాజేందర్ అక్రమ ఆస్తులపై ప్రశ్నించినందుకు అనేక అక్రమ కేసులు పెట్టి 62 రోజులు తనను, తన అనుచరులను జైల్లో పెట్టారని సంపత్ గుర్తు చేసారు. ఇప్పుడు నాగార్జున పాల డైరీ కార్మికులకు అన్యాయం జరుగుతోందని, పాలల్లో పౌడర్ కలుపుతున్నా రని ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే తనపై కుట్ర చేసి.. తన అనుచరుడు రూ 15 లక్షలు అడుగుతున్నారని బురదచల్లే ప్రయత్నంగా ఒక ఆడియో రిలీజ్ చేసాడని అయన ఆరోపించారు. దళితులు ప్రశ్నించడమే నేరమైతే ప్రశ్నించిన ప్రతిసారి తనపై అక్రమ కేసులు పెడితే ఈ ప్రజాస్వామ్యంలో తమ పాత్ర ఏమిటని అయన ప్రశ్నించారు. దళితులను కాపాడాల్సిన చట్టాలే దళితులను నేరస్తులను చేస్తే ఈ సమాజంలో ప్రజాస్వా మ్యం ఉందా ? లేదా ? అని అయన మండిపడ్డారు. నాగార్జున డైరీ పుల్లూరి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తేల్చాలని ఎవరెవరు ఆ కుట్రలో భాగస్వామ- ఎలైనరో తేల్చాలని ఒకవేళ నిజంగా తన అనుచరుడే డబ్బులు అడిగి ఉంటే తనపై కూడా కేసు నమోదు చేయాలని,లేదా నాగార్జున డైరీ చైర్మన్ ప్రభాకర్ రావు కుట్ర చేసి ఉంటే తనపై కేసు నమోదు చేయాలని సంపత్ సవాల్ చేసారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని పోలీసులకు సంపత్ విజ్ఞప్తి చేసారు.










