‘సబ్బని’ ఇంటికి జనప్రవాహం – సమస్యలు పరిష్కరించాలని వెంకట్‌కు దరఖాస్తులు – సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజల రాక.

బాహుబలం ప్రతినిధి హుజురాబాద్, జులై 29:
ఆయన ప్రజాప్రతినిధి కాదు.కానీ,ఆయన వచ్చారని తెలుసుకుని జనం తండోపతండాలుగా తరలివచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సిర్సపల్లి గ్రామంలోని ఇంటిని వెతుక్కుంటూ మరీ వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు వేడుకున్నారు.ఇంతకీ ఆయనెవరంటే.ప్రముఖ సామాజికవేత్త,మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్ ప్యాక్ట్’వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్.

సోమవారం ఆయన తన సొంతూరు సిర్సపల్లికి వచ్చారనే సంగతి తెలుసుకుని జనం ప్రవాహంలా ఆయన ఇంటిబాట పట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో పాటు గోదావరిఖని, మంచిర్యాల్, కరీంనగర్ నుంచి కూడా ప్రజలు వచ్చారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వారంతా ఇంటిలో బారులు తీరారు.

ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంకట్ ‘నేనున్నానని వారికి భరోసా’కల్పించి,తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తన టీమ్ కు సబ్బని వెంకట్ సూచనలు చేశారు.పిల్లల చదువులకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలను విద్యా సంస్థల యజమానులతో మాట్లాడి పరిష్కారం చేశారు.కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉపాధి లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని తెలుపగా..తక్షణమే ఉపాధి కల్పనకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ వెంకట్ అనేకమంది చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనేకమంది తమ లాంటి పేద ప్రజలకు వెంకట్ ఆస్పత్రుల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని వెల్లడించారు.ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా నిస్వార్థంగా తమకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు తమ కుటుంబాలు సబ్బని వెంకట్ కు రుణపడి ఉంటాయని పేర్కొన్నారు.
సబ్బని వెంకట్ నివాసం ప్రజాపాలన భవనం మాదిరిగా అనిపించిందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. యువతకు ఉద్యోగాలతో పాటు మౌలిక వసతుల కల్పన, అనారోగ్యం విషయమై ట్రీట్ మెంట్ తో పాటు పలు విషయాలపై పలువురు సబ్బని వెంకట్ కు దరఖాస్తులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి సబ్బని వెంకట్ తన టీంకు సూచనలు ఇచ్చారు.పదవి లేకపోయినా ప్రజల కోసం సబ్బని వెంకట్ తన శక్తి మేరకు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని పలువురు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..