బాహుబలం న్యూస్ హుజురాబాద్ జులై 28:
తమ గురువులు చెప్పిన విద్య,తాము పడిన బెత్తం దెబ్బలు,చిన్న చిన్న అల్లరులు,స్కూల్ ప్రాంగణంలో కొనుక్కున్న తినుబండారాలు,కోదండం ఇలా తమ విద్యార్థి దశలో గడిచిన గుర్తులను నాటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఉషోదయ స్కూల్ 2002-03 బ్యాచ్ పదవ తరగతి స్టూడెంట్స్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.ఈ సందర్భంగా ఆ బ్యాచ్ కి చెందిన 48 మంది విద్యార్థులు ,10 మంది గురువులు ఒకే వేదికగా తమ తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా నాటి గురువులు మాట్లాడుతూ కష్ట నష్టాలలో ఒకరికొకరు తోడుగా ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం గురువులను శాలువా,షీల్డ్ లతో ఘనం గా సన్మానించారు. పాదాభివందనం చేశారు.కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాప కులు మండల వీరస్వామి,గురువులు చిలుకమారి సత్య రాజ్,గునిగంటి శ్రీనివాస్,మండల సత్య నారాయణ, శ్రీనివాస్ చారి,రేణుక,ఫరీదా భాను,స్టూడెంట్స్ సంపత్, శ్రీనివాస్,సురేష్,సృజన్,రమాదేవి,సృజన,సంధ్య తదితరులు పాల్గొన్నారు










