అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి సహస్రకు కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్ చేయూత సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.2.50 లక్షల ఎల్ఓసి మంజూరు చిన్నారికి నిమ్స్ లో సహస్రకు పూర్తయిన చికిత్స ప్రస్తుతం ఆరోగ్యంగా సహస్ర ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మా పాప మరో పునర్జన్మ ఇచ్చిన వొడితల ప్రణవ్ రుణపడి ఉంటాం అంటున కుటుంబం.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజూరాబాద్
నిరుపేద,రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి చెందిన చిన్నారికి అనారోగ్యం సమస్య రాగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ మానవతా హృదయంతో చిన్నారి చికిత్సకు సహకరించారు.ఈ రోజు శుక్ర వారం
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కలిసిన ఆ కుటుంబం వోడితల ప్రణవ్ కు కాంగ్రెస్ పార్టీ కి కృతజ్ఞతలు తెలియజేశా రు.కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామా నికి చెందిన మేడిపల్లి శ్రీనివాస్ స్వప్నలకు నాలుగేళ్ల కుమార్తె సహస్ర ఉంది.సహస్ర కు మెదడుకు సంబంధించి “థర్డ్ వెంట్రుకల్ సిస్టమ్” అనే వ్యాధితో బాధపడుతోంది.చిన్నారి చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తల్లిదండ్రులు తిరిగారు.చికిత్స కోసం రూ.2.50 లక్షలు ఖర్చు అవుతుంద ని వైద్యులు చెప్పారు.కానీ అన్ని డబ్బులు చెల్లించలేని పరి స్థితిలో ఈ విషయాన్ని పలువురు హుజురాబాద్ నియోజకవ ర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువచ్చి నా వెంటనే స్పందించిన ఆయన ప్రభుత్వంతో చర్చించి రూ.2,50,000/-రెండు లక్షల యాభై వేల రూపాయలను సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ ఓ సి మంజూరు చేయించారు.నెల రోజుల క్రితం హైదరాబాద్ లోని నిమ్స్ లో సహస్రకు చికిత్స నిర్వహించగా ప్రస్తుతం ఆరోగ్యం గా ఉందని కుటుంబసభ్యు లు తెలిపారు.పేదరికంలో ఉన్న తన చిన్నారి చికిత్సకు అండగా నిలిచి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ వో సి ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబుకు చిన్నారి సహస్ర తల్లిదండ్రు లు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !