venkataswamy Sabbani బాహుబలం ప్రతినిథి హుజూరాబాద్ జులై 16:
సైదాపూర్:ముదిరాజులను బిసి’డి’నుండి బిసి ‘ఏ’ లోకి మార్చాలని కోరుతూ సైదాపూర్ తహసిల్దార్ కు మంగళ వారం ముదిరాజులు వినతి పత్రం అందజేశారు.కరీంనగర్ జిల్లా సైదాపూర్ లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి గీకురు రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య ముదిరాజ్,మహాసభ మండల అధ్యక్షులు రేగుల అశోక్ ల ఆధ్వర్యంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ నుండి తహసిల్దార్ కార్యాల యం వరకు ర్యాలీగా వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని,చేపల వృత్తిలో ఎలాంటి షరతులు లేకుండా సభ్యత్వాలు ఇవ్వాలని కోరా రు.50సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముదిరాజ్ కు ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభు త్వం ముదిరాజులకు ఇచ్చే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో సొసైటీలకు నగదు బదిలీ చేయాలి కోరారు. ముదిరాజుల ప్రాతినిధ్యం పెంచడానికి రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని,రాబోయే స్థానిక సంస్థల ఎన్ని కల్లో ముదిరాజులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. తెలంగాణ శాసనమండలిలో మూడు స్థానాలు,రాజ్యస భలో ఒక స్థానం కల్పించాలన్నారు.మత్స్యకారుల అభివృ ద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేసి 75శాతం సబ్సి డీతో సంక్షేమ పథ కాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముదిరాజులు రాజకీయ,ఆర్థిక,సామాజిక సేవ రంగాల్లో రాణించినప్పుడే సొసైటీ లో గుర్తింపు ఉంటుందని నాయ కులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడ ర్,జిల్లా ప్రధాన కార్యదర్శి గీకురు రవీందర్,జిల్లా ఉపాధ్య క్షులు రాయిశెట్టి చంద్రయ్య. మండల అధ్యక్షులు రేగుల అశోక్,మండల ప్రధాన కార్యదర్శి గుళ్ళు అశోక్,మండల పిఆర్ఓ గుళ్ల అజయ్,మండల యువత అధ్యక్షులు మద్ది పవన్,గ్రామశాఖల అధ్యక్షులు అధ్యక్షులు నెల్లి రాములు. గంగాధర మల్లయ్య,అధ్యక్షులు కాశవేణి మొగిలి,జిల్లా కార్యదర్శి నెల్లి పోచయ్య,పిట్టల సారయ్య,గందే రమేష్. పోలవేణి బిక్షపతి,శ్రీనాథ్,గుళ్ళ సారయ్య,నెల్లి శంకర్,నెల్లి సదానందం,మెడవేణి నరేష్,నెల్లి శ్రీకాంత్,మద్ది రాజు. గుళ్ళ రాజు,గుళ్ళు శ్రీను,గుళ్ళ నరేష్, గుళ్ళ సదానందం, బొల్ల శ్రీను,అన్ని గ్రామాల ముదిరాజ్ యువకులు కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.











