యుద్ధ ప్రాతిపదికన శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం పనులు… ఆలయ నిర్మాణానికి సహకరించాలన్న కమిటీ సభ్యులు…

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిథి సైదాపూర్:
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లాస్మన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు దొనపాటి రాంరెడ్డి తెలిపారు.ఈ సంద ర్భంగా ఆలయ అధ్యక్షులు దొనపాటి రాంరెడ్డి మాట్లాడుతూ లాస్మన్నపల్లె గ్రామం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన సందర్భంగా గ్రామంలో శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం నిర్మించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించగా గ్రామానికి చెందిన ఇరుమల మణమ్మ మల్లారెడ్డిలు 3గుంటల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.ఆలయ నిర్మాణానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్ని రకాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చిన ట్లు చెప్పారు.ఆలయ నిర్మాణం కోసం పల్సాని రాంరెడ్డి 50వేలు,కొండ శ్రీధర్ స్వామివారి విగ్రహంతో పాటు,గ్రానైట్ దర్వాజా,గోపురం నిర్మాణం కోసం దాదాపు 4లక్షల రూపాయ లు అందజేస్తామని చెప్పినట్లు రామ్ రెడ్డి తెలిపారు.మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ 50వేలు,ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి 50వేలు,మూల సాయి రెడ్డి జ్ఞాపకార్థం వారి తల్లి భూలక్ష్మి 30వేలు అందజేసినట్లు చెప్పారు.గుంటి బిక్షపతి ఆలయంలో నవగ్రహాల ఏర్పాటుతోపాటు వంద సిమెంట్ బ్యాగులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు,భక్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులు తమకు తోచిన విధంగా సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కొండ శ్రీధర్, పల్సాని రామిరెడ్డి,సలహాదారులు కొట్టే వెంకటరెడ్డి,మేకల రాజిరెడ్డి,తాజామాజీసర్పంచ్ కాయిత రాములు,ఉపాధ్యక్షులు మేకల రవీందర్ రెడ్డి,జనరల్ సెక్రటరీ తలారి విష్ణు,జాయింట్ సెక్రెటరీ రేగుల సురేష్, ట్రెజరీ రేగుల తిరుపతి,కార్యవర్గ సభ్యులు మారం నారాయణరెడ్డి,నాంపల్లి భూపతి,కొంపల్లి రాజిరెడ్డి, జాల సంపత్ రెడ్డి,పెసరి అశోక్,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..