సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిథి సైదాపూర్:
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లాస్మన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు దొనపాటి రాంరెడ్డి తెలిపారు.ఈ సంద ర్భంగా ఆలయ అధ్యక్షులు దొనపాటి రాంరెడ్డి మాట్లాడుతూ లాస్మన్నపల్లె గ్రామం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన సందర్భంగా గ్రామంలో శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం నిర్మించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించగా గ్రామానికి చెందిన ఇరుమల మణమ్మ మల్లారెడ్డిలు 3గుంటల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.ఆలయ నిర్మాణానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్ని రకాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చిన ట్లు చెప్పారు.ఆలయ నిర్మాణం కోసం పల్సాని రాంరెడ్డి 50వేలు,కొండ శ్రీధర్ స్వామివారి విగ్రహంతో పాటు,గ్రానైట్ దర్వాజా,గోపురం నిర్మాణం కోసం దాదాపు 4లక్షల రూపాయ లు అందజేస్తామని చెప్పినట్లు రామ్ రెడ్డి తెలిపారు.మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ 50వేలు,ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి 50వేలు,మూల సాయి రెడ్డి జ్ఞాపకార్థం వారి తల్లి భూలక్ష్మి 30వేలు అందజేసినట్లు చెప్పారు.గుంటి బిక్షపతి ఆలయంలో నవగ్రహాల ఏర్పాటుతోపాటు వంద సిమెంట్ బ్యాగులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు,భక్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులు తమకు తోచిన విధంగా సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కొండ శ్రీధర్, పల్సాని రామిరెడ్డి,సలహాదారులు కొట్టే వెంకటరెడ్డి,మేకల రాజిరెడ్డి,తాజామాజీసర్పంచ్ కాయిత రాములు,ఉపాధ్యక్షులు మేకల రవీందర్ రెడ్డి,జనరల్ సెక్రటరీ తలారి విష్ణు,జాయింట్ సెక్రెటరీ రేగుల సురేష్, ట్రెజరీ రేగుల తిరుపతి,కార్యవర్గ సభ్యులు మారం నారాయణరెడ్డి,నాంపల్లి భూపతి,కొంపల్లి రాజిరెడ్డి, జాల సంపత్ రెడ్డి,పెసరి అశోక్,తదితరులు పాల్గొన్నారు.











