బొమ్మకల్ లో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

బాహుబలంన్యూస్ సైదాపూర్ జూన్ 25:
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి చనిపోవడం వలన టైం కు ఎల్లమ్మ బోనాలు చేయలేకపోయిన కాలనీవాసులు తిరుగువారమైన మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రతి గడప నుండి మహిళలు బోనాలు ఎత్తుకొని డబ్బు సప్పులతో శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా గ్రామ శివారులో గల ఆలయానికి చేరుకొని రేణుక ఎల్లమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వర్షాలు బాగా పడాలని బాగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !