అధిక పీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు.. పట్టించుకోని జిల్లా విద్యఅధికారి, మండల విద్యాధికారిలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు… తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్ర శ్రీధర్ రెడ్డి…

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి)
హుజూరాబాద్ జూన్ 24;హుజురాబాద్ లో ప్రవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇష్టం సారంగా వివరిస్తూ ,ఫీజులు వసూలు చేస్తున్నారని సంబంధించిన విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్ర శ్రీధర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా విద్యాధికారులైన జిల్లా విద్యాధికారి,డి ఇ ఓ,మండల విద్యాధికారి ఎంఈఓ ల పైన సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కు,ఫిర్యాదు చేశామని తెలిపారు.అనంతరం మాట్లాడుతూ విద్య హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసి ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యా లు NCRT నియమ బంధనలనలకు వ్యతిరేకంగా పాఠశా లలను నడిపిస్తూ,అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఇంత జరుగుతున్న సంబంధించిన విద్యాశాఖ అధికారు లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూ ప్రవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.ప్రవేట్ పాఠశాల యజమా న్యాలకు హుజురాబాద్ విద్యాశాఖ అధికారుల మధ్య ఏమైనా ఒప్పందం జరిగిందా ??అని అనుమానాలు వస్తున్నాయన్నారు.సోమవారం రోజున ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఫిర్యాదుకు జోడించడం జరిగిందని తెలిపారు.నర్సరీ చదివే విద్యార్థుల బుక్స్ కు 3000 నుండి 5000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు .కొన్ని పాఠశాలలు అనుమతులు లేకున్నా నడుస్తున్నా యని,ఇప్పటికైనా అనుమతి లేని పాఠశాల పేర్లు పత్రిక ముఖంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఇష్టాను సారంగా నడిపిస్తున్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యాలపై చర్యలు తీసుకోవాల ని,చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడ తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !