హుజురాబాద్ లో జిల్లా కోర్టు ఏర్పాటుకు న్యాయవాదుల డిమాండ్ ప్రభుత్వం స్పందించకపోతే తమ వృత్తికే ప్రమాదం ప్రజల అవసరాల మేరకు తమ డిమాండును నెరవేర్చాలి

సబ్బని వెంకటస్వామి
బాహుబలం ప్రతినిధి హుజురాబాద్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరెన్నికగల పాత తాలూకా కేంద్రమైన హుజురాబాద్ లోని తక్షణమే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులు శుక్రవారం రాత్రి డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం తీసుకు న్న అనాలోచిత నిర్ణయం వల్ల హుజురాబాద్ ప్రాంత న్యా యవాదులకు తీవ్ర నష్టం జరిగిందని బాణాల శ్యాంసుం దర్ అనే సీనియర్ న్యాయవాది ఈ సందర్భంగా తెలిపా రు.కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2014 లో ఎవరు ఊహించని విధంగా అప్పటివరకు ఉన్న పది జిల్లాలను ఏకంగా 33 జిల్లాలను ఏర్పాటు చేయడం వంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఈ ప్రాంత న్యాయవాదులకు తీవ్ర నష్టం జరిగిందని శ్యాంసుందర్ఆరోపించారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని హుజురాబాద్ కోర్టును సిద్దిపేట హన్మకొండ  జిల్లాల పరిధిలోకి విభజన చేయడం వల్ల ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం కన్నా న్యాయవాదులకు అధికంగా నష్టం జరిగిందన్నారు.కరీంనగర్ జిల్లా పరిధి లోని ప్రాంతాలను సిద్దిపేట హన్మకొండ  జిల్లాలుగా మార్చడం వలన హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఎల్కతుర్తి  భీమదేవరపల్లి. కమలాపూర్ తదితర మూడు మండలాలకు చెందిన వంగర భీమదేవరపల్లి మండలాలు హన్మకొండ  జిల్లాల పరిధిలోకి వెళ్లినట్లు శ్యాంసుందర్ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా హుజురాబాద్ కోర్టులో నాలుగు కోర్టులు పనిచేస్తుండగా ఇందులో రెండు క్రిమినల్ కోర్టులు. ఒక సివిల్ కోర్టు మరియు సబ్ కోర్టులు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. మొత్తం దాదాపు 15 కోర్టుల పరిధి ఉండగా విస్తరించబడిన జిల్లాల కారణంగా ప్రస్తుతం ఆరు మండ లాలు మాత్రమే అందుబాటులో ఉండడం శోచనీయమని శ్యాంసుందర్ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఈ ప్రాంత న్యాయ వాదులు అలుపెరుగని పోరాటం చేసినప్ప టికీ ప్రస్తుతం ఈ విధమైన అన్యాయం తమకు ఎదురు కావడం దురదృష్ట సంఘటనగా తాము భావిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఈ విష యంలో చొరవ తీసుకొని హుజరాబాద్ లో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాము వినమ్రతతో వేడుకుంటున్నట్టు బాణాల శ్యాంసుందర్. మరో జూనియర్ న్యాయవాది నరహరి స్వామి తాడికల్ ఈ సందర్భంగా కోరారు. ఇదిలా ఉండగా జూనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టు పరిధి తగ్గడం వలన కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఫలితంగా తాము ప్రస్తుతం కొనసాగిస్తున్న న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి ఇతర వృత్తులలోకి చేరాలని ఆలోచన తమలో మొదలైన ట్లు వారు ఆవేదనతో పేర్కొన్నారు. హుజురాబాద్ కోర్టు పరిధిలో 15 మండలాలు ఉన్నప్పుడు ప్రభు త్వం 10 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని  హంగులతో ప్రజలు హర్షిం చే రీతిలో 8 కోర్టులు పనిచేసే విధంగా అద్భుతమైన భవన నిర్మాణం ఇక్కడ పూర్తి చేయడం జరిగిందని.ఏ ఆశయం కోసం అయితే ఇంతటి వ్యయంతో నిర్మించిన కోర్టు పరిధి లో జిల్లా కోర్టును ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతై నా ఉందని బాణాల శ్యాంసుందర్. జూనియర్ న్యాయవా ది తాడికల్ స్వామి ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం  రాత్రి విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !