అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపజేయాలి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్

బాహుబలం న్యూస్ మే 17 హుజురాబాద్
రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింప చేయాలని,అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం రోజున స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం పండించే రైతుల కు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్గు రూపాయలు 500 బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటనలు వస్తున్నాయన్నారు.
ఈ వార్తతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసిందని,మామిడి కాయలు నేలరాలాయని, పిడుగుపాటుతో ఆవులు,గేదెలు చనిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోకవడం విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు దొడ్డు వడ్లను 80% శాతం పండిస్తారని,సన్న వడ్లను 20% మాత్రమే పండిస్తారని అన్నారు.దొడ్డు వడ్లను పండించే రైతులు అధికులు సన్నా చిన్నకారు రైతులేనని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా క్వింటాల్ వడ్లకు రూపాయ లు500 బోనస్ చెల్లిస్తామంటూ వాగ్దానం చేసిందని,కానీ సన్న బియ్యం,దొడ్డు బియ్యం అంటూ ఎక్కడ ప్రస్తావించలేదు అన్నారు.ఇప్పుడు సన్న బియ్యం పండించే రైతులకు మాత్రమే బోనస్ వస్తుందనే వార్తలు రైతులను తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయని అన్నారు.అన్ని రకాల వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయిల 500 బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ఆసంగి సీజన్ నుండి బోనస్ చెల్లింపు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.అన్నదాతలు ఉన్న ఆందోళన తొలగించడం కోసం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షర తుల్లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాసు దేవారెడ్డి కోరారు.ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వెలమారెడ్డి రాజిరెడ్డి జిల్లా నాయకులు గుండేటి వాసుదేవ్ మండల నాయకులు ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….