పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ ఏప్రిల్ 29
పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు హుజురాబాద్ మండలం దమ్మక్కపే ట గ్రామానికి చెందిన బొరగాల సమ్మయ్య (సారయ్య) తన కార్య కర్తలతో సోమవారం రోజున హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భం గా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బోరగాల సమ్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.పార్టీలో చేరిన వారు కోమురయ్య, రాజకుమార్, సారయ్య, నర్సయ్య, రాజయ్య స్వామి సతీష్ మల్లేష్ చేరాలు సమ్మయ్య దేవయ్య తదిత రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !