కోలోరెక్టల్ కాన్సర్ పై ప్రజలకు అవగాహన .. గోడపత్రిక ఆవిష్కరణ.

కోలోరెక్టల్ కాన్సర్ పై ప్రజలకు అవగాహన .. గోడపత్రిక ఆవిష్కరణ. చైతన్య రథం ప్రారంభం.
కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో

హుజూరాబాద్ మార్చి 21
హుజూరాబాద్ కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కోలోరెక్టల్ కాన్సర్ అవగాహన నెల మార్చ్ లో భాగంగా కోలన్ క్యాన్సర్ (పెద్ద ప్రేగు క్యాన్సర్) కు సం బంధించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం కూరపాటి హాస్పిటల్ యాజమన్యం డా. కూరపాటి రాధికారమేష్, గోడ పత్రిక లని ఆవిష్కరించి ,చైతన్య రథం ని ప్రారంభించా రు.

 

ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడు తూ ప్రస్తుత జీవన విధానంలో పెద్దపేగు కాన్సర్ కూడా ఒక మహమ్మారి ల వ్యాప్తి
చెందింది .మలం లో రక్తం పడటం ని సాధా రణ పైల్స్ గ భావించి నాటు వైద్యుల సలహా లు తీసుకోవడం ,లేటుగా గుర్తించడం,50 సంవత్సరాల వయసు పైబడిన వారిలో ఎక్కువ గా గుర్తించడం వలన కాన్సర్ బారిన పడాల్సి వస్తుందన్నారు.కావున మలం లో రక్తం పడటం ని ప్రారంభ దశలలో నే గుర్తించి డాక్టర్ గారి సలహాలు పొందటం వలన కాన్సర్ నుండి విముక్తి పొందవచ్చు .అలాగే డాక్టర్ రాధికా మాట్లాడుతూ .. స్త్రీలలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాకూడా సిగ్గు బిడియం వలన తగిన సమయం లో డాక్టర్ గారి సలహాలు తీసుకోకపోవడం వల న వ్యాధి బారిన పడాల్సివస్తుందన్నారు.

 

కావున ప్రారంభ దశలోనే తగిన సలహాలు తీసుకోవాలని సూచించారు ,వీటిని ముందు గా గుర్తించి తగిన చికిత్స తీసుకో గలిగితే కాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ గా ఉంటాయి అని వివరించారు , ఈ కార్యక్ర మం లో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !