బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 22: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్’ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరుగుతాయని హుజూరాబాద్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకురాలు (ఏడీఏ) జి.సునీత తెలిపారు. పాత యాప్ స్థానంలో ఈ నెల 21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.
రైతులు ఎకరాకు రెండు బస్తాల చొప్పున జిల్లాలోని ఏ మండలంలోనైనా ఎరువులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్లో ఎరువులు పొందాలంటే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరిగా ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు వెంటనే మీ-సేవ కేంద్రాలు లేదా ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, బుకింగ్లో సమస్యలుంటే డీలర్లు లేదా వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని స్పష్టం చేశారు.
Post Views: 4









