ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ యాప్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు హుజూరాబాద్‌ ఏడీఏ జి.సునీత.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ యాప్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు హుజూరాబాద్‌ ఏడీఏ జి.సునీత.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌, ఆగస్టు 22: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్స్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు జరుగుతాయని హుజూరాబాద్‌ డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకురాలు (ఏడీఏ) జి.సునీత తెలిపారు. పాత యాప్‌ స్థానంలో ఈ నెల 21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.
రైతులు ఎకరాకు రెండు బస్తాల చొప్పున జిల్లాలోని ఏ మండలంలోనైనా ఎరువులు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌లో ఎరువులు పొందాలంటే ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ తప్పనిసరిగా ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులు వెంటనే మీ-సేవ కేంద్రాలు లేదా ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, బుకింగ్‌లో సమస్యలుంటే డీలర్లు లేదా వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌, ఆగస్టు 22: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్స్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు జరుగుతాయని హుజూరాబాద్‌ డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకురాలు (ఏడీఏ) జి.సునీత తెలిపారు. పాత యాప్‌ స్థానంలో ఈ నెల 21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.
రైతులు ఎకరాకు రెండు బస్తాల చొప్పున జిల్లాలోని ఏ మండలంలోనైనా ఎరువులు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌లో ఎరువులు పొందాలంటే ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ తప్పనిసరిగా ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులు వెంటనే మీ-సేవ కేంద్రాలు లేదా ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, బుకింగ్‌లో సమస్యలుంటే డీలర్లు లేదా వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి. వన్నారంలో ఘన స్వాగతం పలికిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు… రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !