బాహు బలంన్యూస్: హుజురాబాద్/కరీంనగర్, జూలై 10 : జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త పేరాల నాగయ్య నియమితులయ్యారు. జిల్లా స్థాయిలో వెనుకబడిన తరగతుల (బీసీల) సామాజిక, రాజకీయ చైతన్యం కోసం, వారి హక్కుల సాధన మరియు సమస్యల పరిష్కారం కోసం ఆయన అందిస్తున్న నిరంతర సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నియామక ఉత్తర్వులను సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేష్ యాదవ్ అధికారికంగా జారీ చేశారు. నాగయ్య సేవా నిరతి, బీసీ వర్గాల పట్ల ఉన్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని, జిల్లాలో సంఘ బలోపేతానికి ఆయన మరింత కృషి చేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు జాతీయ నాయకత్వం పేర్కొంది.
చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనే లక్ష్యం: పేరాల నాగయ్య
ఈ సందర్భంగా నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి పేరాల నాగయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్యకు, జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేష్ యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు భీమ సాయిలు యాదవ్, సందెల వెంకన్న, కందికొండ మొగిలి తదితరులకు ఆయన ధన్యవాదాలు సమర్పించారు.
అనంతరం నాగయ్య మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాలను సంఘటితం చేసి, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో బీసీల హక్కుల రక్షణతో పాటు, చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్ల సాధన కోసం సాగే పోరాటాలు, ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తానని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.











