ప్రభుత్వ వసతి గృహంలో చేరండి.. ఉజ్వల భవిష్యత్తును అందుకోండి! కేశవపట్నం బాలుర హాస్టల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. 70 సీట్లు ఖాళీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ /శంకరపట్నం, జూలై 09 :
కేశవపట్నంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం (Govt S.W. Boys Hostel) లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి (HWO) బి. రవిందర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఉచిత వసతి.. నాణ్యమైన భోజనం..
ఈ వసతి గృహంలో ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కొరకు మొత్తం 70 ఖాళీలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ చేరిన విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఉచిత వసతితో పాటు నాణ్యమైన, పౌష్టికాహార భోజన సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. అర్హత గల పేద విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వివరాలకు సంప్రదించాల్సిన నంబర్
వసతి గృహంలో చేరాలనుకునే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మరిన్ని వివరాల కోసం కేశవపట్నంలోని వసతి గృహాన్ని నేరుగా సందర్శించవచ్చని లేదా వసతి గృహ సంక్షేమ అధికారి బి. రవిందర్‌ను 9963767800 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
మండలంలోని ప్రజాప్రతినిధులు, విద్యార్థి, కుల సంఘాల నాయకులు, సామాజిక, యువజన, దళిత బహుజన సంఘాల నాయకులు మరియు పత్రికా విలేఖరులు చొరవ తీసుకుని, అర్హులైన పేద విద్యార్థులు వసతి గృహంలో చేరేలా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !