పేదల ఇళ్లు కూల్చడమే ప్రజాపాలననా?: లోకిని రాజు ధ్వజం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ మార్చి 11: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బ్రతుకులపై బుల్డోజర్లు పెడుతోందని తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూదాన భూములలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేద ప్రజల ఇళ్లను అన్యాయంగా కూల్చివేసి, ఆ భూములను రాజకీయ బడా నాయకులకు ధారదత్తం చేసేలా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఖమ్మం వెలుగుమట్లలో బాధితుల కోసం పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క మరియు డాక్టర్ విశారదన్ మహారాజ్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
కవితక్క దీక్షకు పూర్తి మద్దతు
పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న కవితక్క ధైర్యానికి, నిబద్ధతకు తాము అండగా ఉంటామని లోకిని రాజు ప్రకటించారు. “అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గను.. బాధితులకు న్యాయం జరిగే వరకు నా దీక్ష ఆగదు” అని ఆమె చెప్పడం ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసి రోడ్డున పడ్డ బాధితులకు ప్రభుత్వం వెంటనే అదే చోట ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవితక్క చేస్తున్న ఈ పోరాటం ఒక వ్యక్తి కోసం కాదని, బాధితుల భవిష్యత్తు కోసం అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, అప్పటివరకు ఈ దీక్షకు తెలంగాణ ఆదివాసి జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని లోకిని రాజు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరాటం. మద్దతు ప్రకటించిన రాష్ట్ర మహిళా సంఘాలు; 8 వేల మందితో హాజరవుతామని వెల్లడి. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.