బాహు బలంన్యూస్ హుజురాబాద్, డిసెంబర్ 16:
కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం పరిధిలోని వెంకట్రావు పల్లె గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ బిడ్డ కన్నెబోయిన విజేందర్ గారికి మద్దతుగా బడుగు బలహీన వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి. ‘అగ్రవర్ణాలను ఓడిద్దాం, బీసీ బిడ్డను గెలిపించుకుందాం’ అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టుకుంటున్నారు. విజేందర్ గారు తమ ఎన్నికల గుర్తు అయిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులు, మద్దతుదారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
గత అభివృద్ధి, నిస్వార్థ సేవలే కీలకం
ప్రచారంలో విజేందర్ గారి మద్దతుదారులు, గతంలో సర్పంచ్గా పనిచేసిన వారి భార్య, కీర్తిశేషులు కన్నేబోయిన దేవమ్మగారు గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను బలంగా ప్రజలకు వివరిస్తున్నారు. దేవమ్మగారు హయాంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, విద్యాలయ భవనం నిర్మాణం వంటి కీలక పనులు జరిగాయని గుర్తు చేస్తున్నారు. వీటితో పాటు, మిషన్ భగీరథ నల్లాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాటు, చెరువులో పూడిక తీయించడం వంటి మౌలిక వసతుల కల్పనలో ఆమె పాత్ర అమోఘమని పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామంలో కరువు వచ్చినప్పుడు ట్రాక్టర్ వాటర్ ట్యాంకులతో ఇంటింటికీ నీళ్లు పోయించడం వంటి నిస్వార్థ సేవ ఆమె నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని తెలిపారు.
డబ్బుకు, హామీలకు లొంగవద్దు: అభ్యర్థి విజ్ఞప్తి
ఈ సందర్భంగా, అగ్రవర్ణాల ఉచ్చులో పడకుండా, వెనుకబడిన వర్గాల అభ్యర్థిగా ఉన్న విజేందర్ యాదవ్ గారిని గెలిపించుకుంటేనే గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన మద్దతుదారులు దృఢంగా చెబుతున్నారు.
వారు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “జనరల్ స్థానంలో మన బడుగు బలహీన వర్గాల బిడ్డలను గెలిపించుకుందాం. ఎన్నికల సమయంలో మాత్రమే ఊరికి వచ్చి, డబ్బుకు, మధ్యానికి అమ్ముడుపోవాలని చూసే వ్యక్తులకు లొంగవద్దు,” అని గట్టిగా హెచ్చరించారు. ఈరోజు సాధ్యం కాని హామీలు ఇచ్చి, రేపు గ్రామాన్ని దోచుకునే అవకాశం ఉందని, మనతో కలిసి ఉన్న, మన కష్టాలు తెలిసిన వ్యక్తిని ఎన్నుకోవాలని వెంకట్రావు పల్లె ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.











