బీసీల వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ – సమగ్ర సర్వే మరల సర్వే చెయ్యాలి BRS పార్టీ కన్నాయిగూడెం మండల సోషల్ మీడియా కావిరి అంజన్ రావు నేత..

బాహుబలం న్యూస్ ప్రతినిధి కన్నాయిగూడెం ఫిబ్రవరి 11:
కులగణన లో బీసీలను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపారని అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు చేసి అధికారం చేపట్టాక తొక ముడిచిన కాంగ్రెస్ అని
BRS పార్టీ కన్నాయిగూడెం మండల సోషల్ మీడియా కావిరి అంజన్ రావు అన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంపు మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు.బీసీ సబ్ ప్లాన్ పెట్టీ లక్షకోట్ల కేటాయింపు ఏమైంది..? అని అన్నారు.
బీసీ కులాల కార్పొరేషన్ లా ఏర్పాటు ఏదీ – ఒక్కో కార్పొరేషన్కు 100 కోట్లు కేటాయింపు ఏమైందని పేర్కొన్నారు.
తప్పుల తడకగా ఉన్నా కుల గణనను మళ్లీ సమగ్ర సర్వే చేయాలి కెసిఆర్ చేయించిన సర్వేలో నుండి దాదాపు 25 లక్షల పైగా బీసీలు లేకుండా చూపడం సిగ్గుచేటుఅని తెలిపారు.
బీసీలపై మీ కాంగ్రెస్ కు ఉన్న సవతిప్రేమ అర్థం అయ్యింద-రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక విధానాలను మానుకోవాలని పేర్కొన్నారు.మీ పార్టీ నేతలే మిమ్మల్ని, మీ కాంగ్రెస్ విధానాల్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని,ప్రజా వ్యతిరేక విధానాలు రేవంత్ రెడ్డి మానుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా సమగ్ర సర్వేలో బీసీలను అత్యంత తక్కువగా చేసి చూపించడం హేయమైన చర్య అలాగే బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ మాటను ఇచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న నేటికీ ఆ ఊసే ఇతను కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలను దాదాపు 25 లక్షల పైగా జనాభాను తగ్గించి చూపించడం సిగ్గుచేటు ఇది బీసీలను అనగదొక్కాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పన్నాగమని అన్నారు తెలంగాణ జనాభాను కూడా తగ్గించి చూపించడం దాదాపు నాలుగు కోట్ల 20 లక్షలకు పైగా జనాభా ఉంటుందని వివిధ వెబ్సైట్లో ద్వారా ఆధార్ కార్డుల ద్వారా తెలుస్తుంది అయితే కేవలం మూడు కోట్ల 65 లక్షల మంది సర్వేలో పాల్గొన్నట్టు చూపిస్తున్నారు మరి మిగతావారు ఏమైనట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి…

కామారెడ్డి డిక్లరేషన్ నందు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేయకుండా నేటికీ 16 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో వచ్చి అయితే అసెంబ్లీలో కూడా 50% సీట్లు బీసీల కేటాయిస్తామని చెప్పి కేవలం తూతూ మంత్రంగా 29 సీట్లు కేటాయించి చేతులు దులుపుకుంది నేడు సమగ్ర సర్వే పేరుతో బీసీలకు అన్యాయం చేసే విధంగా బీసీ జనాభాను అలాగే తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి చూపించడం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకని తెలంగాణ వ్యతిరేకి అని చెప్పకనే ఈ సర్వేలో రిపోర్టర్లు చెప్తానే ఉన్నాయి.కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా ఆత్మ విమర్శ చేసుకుని ఈ సర్వేలను వ్యతిరేకించాలని తెలియజేస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ప్రస్తుతం మీరు తప్పులతడకగా చేసినటువంటి సమగ్ర సర్వేను మరలా చేయించాలి బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ మాటలు నిలబెట్టుకోవాలి బీసీ కులాలకు కార్పొరేషన్లు కేటాయించి ఒక్కొక్క కార్పోరేషన్కు 100 కోట్ల నిధులను కేటాయించాలి.

బీసీ వ్యతిరేక విధానాలు మానుకొని బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకపోతే రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని BRS పార్టీ కన్నాయిగూడెం సోషల్ మీడియా కావిరి అంజన్ రావు హెచ్చరిస్తాఉన్నాం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !