మూగబోయిన మండల విద్యా వనరుల కేంద్రం.. సైదాపూర్ లో తాళం వేసి ఉన్న ఎమ్మార్సీ కార్యాలయం. నిలిచిన కేజీబీవీలోనీ విద్యా బోధన.

బహుబలం ప్రతినిధి సైదాపూర్, డిసెంబర్ 21 :
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మెతో విద్యపై తీవ్ర ప్రభావం పడుతోంది.శనివారం సైదాపూర్ లోని మండల విద్యవనరుల కేంద్రం తెరచు కోలేదు.ఈ కార్యాలయంలో పని చేసే సమగ్ర శిక్షా ఉద్యోగులంతా కరీంనగర్ లో జరు గుతున్న సమ్మెకు వెళ్లారు. దీంతో ఈ కార్యాలయాన్ని  తెరిచేవారు కరవయ్యారు. విద్యాశాఖలో ముఖ్యమై పనులను ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తుంటారు.సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో సైదాపూర్ లోని ఎమ్మార్సీ కార్యాలయానికి తాళం వేసి ఉంది. తమ డిమాండ్లను సాధించుకోవడానికి గత 13 రోజుల నుంచి జిల్లా కేంద్రంలో సమ్మె బాట పట్టారు.దీంతో మండల కేం ద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో పని చేస్తున్న ఎంఐఎస్ కో ఆర్డినేటర్, డాటా ఎంట్రీఆపరేటర్,సీఆర్పీలు, ఐఆర్పీలు,పి టి ఐ లు, మెసెంజర్ లు సమ్మెలో పాల్గొన్నా రు. ఇది వరకే ఎంఈవో శ్రీనివాస్ రెడ్డికి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ నేపథ్యంలో ఎంఆర్సికి వస్తున్న మధ్యా హ్న భోజన నిర్వాహ కులు ఇబ్బందులు పడుతున్నారు.

సైదాపూర్ కేజీబీవీలో నిలిచిన విద్యా బోధన…
మండల కేంద్రంలోని కేజీబీవీలోని ఎస్ ఓ తో పాటు ఉపాధ్యాయులు కూడా సమ్మెలో పాల్గొనడంతో విద్యార్థులకు విద్యా భోదన నిలిచిపోయింది. కేవలం మెస్ వర్కర్లు మాత్రమే ఉన్నారు. దీంతో భోదన లేక విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. త్వరలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు సమ్మె బాట పట్టడంతో విద్యా ర్థులు చదువు ప్రశ్నర్థకంలో పడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !