మూఢనమ్మకాల్లో ఇంకా బతుకుతున్న కొందరి జీవితాలు….

మూఢనమ్మకాల్లో ఇంకా బతుకుతున్న కొందరి జీవితాలకి ఈ కథ అంకితం.🫵

వితంతువు గా మారిన ఓ కోడలు తాను మూడు నెలల గర్భవతినని అత్తగారికి చెప్పింది.

ఆ మాటతో వారింట్లో కలకలం, భూకంపం పంచాయతీ పెట్టించారు.

పంచాయతీ లో ప్రజలు నీ గర్భానికి కారణం ఎవరని నిలదీశారు.

అప్పుడాకోడలు నేను మూడు నెలల క్రితం ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వెళ్లి స్నానం చేస్తూ గంగా జలాన్ని మూడు సార్లు త్రాగాను దాంతో నేను గర్భం దాల్చానని చెప్పింది.

పంచాయతీ ప్రజలు అలా ఎలా సాధ్యమని గద్దించారు.

అప్పుడామే ఇలా చెప్పింది మహాత్ముడగు మహాపురుషుని వీర్యం గంగలో స్ఖలింపబడింది దానివల్ల నేను గర్భవతి నయ్యాను సర్పంచిగారు అని సమాధానం చెప్పింది.

అందుకు వారు అది అసాధ్యం ఒకరి వీర్యం త్రాగి గర్భం దాల్చడం ముమ్మాటికీ జరగదు అని ముక్త కంఠం తో వ్యతిరేకించారు.

అందుకు ఆ మహిళ చేప హనుమంతుని చెమట ను సేవించి గర్భం దాల్చి మకరధ్వాజునికి జన్మనిచ్చింది.

విభండక ఋషి యొక్క వీర్యస్కళనం ద్వార శృంగిఋషి జన్మించాడు.

సూర్యుని ఆశీస్సులతో కుంతి కర్ణుడికి జన్మనిచ్చింది.

దశరథమహారాజు ముగ్గురు భార్యలు పాయసం సేవించి నలుగురు కుమారులను కన్నారు.

సీతదేవి భూగర్భంలో పాతిపెట్టిన కుండలోంచి పుట్టింది కదా ఇవన్నీ సాధ్యం నాది అసాధ్యమా..

పుక్కటి పురాణాలూ, మతగ్రంధాలు, కట్టుకతలు వ్రాసి ప్రజల్ని అజ్ఞానులుగా చేయబడ్డాయి.

అలాంటి పుస్తకాలు మనకు అవసరం లేదు.

అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, కపటత్వం, గుడ్డిభక్తి లేని.. వైజ్ఞానిక, తార్కిక ఆలోచనలే నేటి మన సమాజానికి అవసరమని…నేను గర్భనాటకమాడాను.. నేను గర్భాన్ని దాల్చలేదు.

నన్ను పరీక్షించి చూసుకొండని సమాధానమిచ్చింది.

ఇది విన్న ప్రజలంతా నిజమే కదా అని ఆలోచనలో పడ్డారు.🤔

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !