స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాల ప్రగతిపై అధికారుల తనిఖీ.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 06రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ ప్రగతిని మంగళవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ ఉన్నత అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఏ డిప్యూటీ డైరెక్టర్ వి. సాయినాథ్, సిడిఏంఏ. అడిషనల్ డైరెక్టర్ డి. జాన్ సామ్ సన్ లు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేశారు. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 30 వార్డులో జరుగుతున్న పనులు నాటుతున్న మొక్కల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ సల్వాది సమ్మయ్య, మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, ఇంచార్జీ మున్సిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారి బషీర్, ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశ్విని గాంధీ
,ఇంచార్జీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎండి రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !