కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏ ఐ ఎస్ బి బంద్ విజయవంతం.. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్.

సబ్బని వెంకటాస్వామి బాహుబలం ప్రతినిది హుజురాబాద్
జూలై 04:
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమం విజయవంతమైంది ఈ సందర్భంగా హుజురాబాద్ బందులో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో విద్యారంగం పూర్తిగా వివక్షకు గురైందని విధ్యారంగా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా 7100 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరియు నీటి పరీక్షలు రద్దుచేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడిని అరికట్టాలని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని ఖాళీగా ఉన్నా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్షల్లో జరిగిన అవతక అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకులాలలో స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ సొంత భవనాలు నిర్మించాలి హాస్టల్ విద్యార్థులకు మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ నాయకులు కుక్కమూడి రాజేష్ కొండ్ర నగేష్ కొండ్ర వినయ్ పిట్టల సాయి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….