దూకుడుకు కళ్లెం వేయండి .. ఏ సి పి సాబ్…

బాహుబలం న్యూస్ హుజురాబాద్.జూన్ 17
హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి పనికోసం వినియోగిస్తున్న ట్రిపర్లు,గ్రానైట్ రాళ్లను తీసుకువెళ్లే భారీ వాహనాలు అతి వేగం అజాగ్రత్తగా వెళ్లడం వలన రోడ్డు ప్రమాదాలుజరుగుతున్నాయని వాటి వేగానికి కళ్లెం వేయాలని హుజురాబాద్ ఏ సీ పి శ్రీనివాస్ జీ ని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని బాణాల శ్యామ్ సుందర్ సీనియర్ అడ్వకేట్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను డ్రంకెన్ డ్రైవ్ పేరిట,ఇసుక లారీలను,ట్రాక్టర్లను తరుచు ఆపి తనిఖీ చేసే సంబంధిత అధికారులు గ్రానైట్ వాహనాలు, మధ్యప్రదేశ్ ట్రిప్పర్లు వాహనాలను ఎందుకు ఆపి ఆ వాహనాల అతి వేగాన్ని,సంబంధిత కాగితలను తనిఖీ చేయడం లేదని అన్నారు.ఎల్కతుర్తి మండలం పెంచ్చికల్ పెట్ నుండి శంకరపట్నo తాడికల్ గ్రామ జాతీయ రహదారి పరిధి గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారని.ఈ రహదారి వాహనాలను తనిఖీ చేస్తే అతి వేగంను నియంత్రించబడు తుందని ప్రజలు సూచిస్తున్నారు.రహదారి పనులకు ఉపయోగించే వాహనాలకు లైసెన్సులు మరియు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారితో మద్యం సేవించి మైనర్లు సైతం అతి వేగంగా అజగ్రత్తగా నడిపి ఆ రహదారిపై వెళ్లే ప్రజల అమూల్యమైన ప్రాణాలను గాలిలో కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు.ఫలితంగా ఈ దారిన ప్రతిరోజు రోడ్డు రక్తంతో తడుస్తుందని వెంటనే అతి వేగానికి కళ్లెం వేసే దిశగా సంబంధిత అధికారులతో చర్యలు చేపట్టి అమూల్యమైన ప్రాణాలను కాపాడాలని ఏ సీ పి ని ప్రజలు కోరుతున్నారు. బాణాల శ్యామ్ సుందర్ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !