ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసు లు…ఈ నెల 20న హాజరుకావాలన్న హైకోర్టు.

(బాహుబలం ప్రతినిథి వెంకటస్వామి సబ్బని)
న్యూస్ హుజురాబాద్ జూన్ 11:
ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ప్రజల ముందు మాట్లాడడం,వీడియోను విడుదల చేశాడని,కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ఆశ్రయించారు.దీంతో కోర్టు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి 24 మంది అభ్యర్థుల అభిప్రాయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.ఒకవేళ కౌశిక్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి మాత్రమే ఎన్నికల్లో గెలిచాడని కోర్టులో రుజువైతే తన ఎమ్మెల్యే పదవికి గండం వచ్చే ప్రమాదం లేకపోలేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !