బీజేపీని ఓడించడి దేశాన్ని రక్షించండి బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే మోడీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇండియా కూటమిని గెలిపిద్దాం…. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి.

బాహు బలం న్యూస్ హుజూరాబాద్
హుజురాబాద్:ఇండియా కూటమి అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ కు పోటీ చేస్తున్నా వెలిశాల రాజేందర్ రావు
గెలుపును మతతత్వ శక్తులకు దానికి పరోక్షంగా సహకరించే శక్తులు అడ్డుకోలేవని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు.హుజురాబాద్ మండల కేంద్రంలో కూరగా యల మార్కెట్,జమ్మికుంట రోడ్డు లో సీపీఐ,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను మోసం చేసిన మోడీ ప్రభుత్వంనికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్దాంగా ఉన్నారు అని,పదేళ్ల మోడీపాలన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడంతోనే సాగిందని అన్నారు. కులాలు,మతాలమధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతున్నా రని అన్నారు.మతతత్వ కార్పొరేట్ పార్టీలను తెలంగాణలో అడుగుపెట్టనీయబోవని అన్నారు.రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటు సాక్షిగా బిజెపి ప్రభుత్వం తెస్తుంటే పరోక్షంగా సహకరించిన టిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసిన ట్లేనని ప్రజలు అప్రమత్తంగా ఈ దేశ ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం పాటుపడే ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ అధికారం చేపట్టిన తరవాత అనేక పోరాటాలుతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజ మాన్యాలకు,కార్పొరేట్ సంస్థలకు,పెట్టుబడిదారులకు అను కూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని 20 సంవత్సరాల దేశ అభివృద్ధిని వెనక్కి నెట్టారని ఆరోపించారు.వెలిశాల రాజేందర్ రావు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ప్రతి బూతులో ప్రతి ఓటర్లు కలిసి మోడీ నిరంకస పాలనపై చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్,జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ సీపీఐ పట్టణ కార్యదర్శి ముత్త రాజు,ఏఐఎస్ఎఫ్ నాయకులు రోహిత్, అభి, సందీప్,సీపీఐ నాయకులు అన్నే ఐలయ్య,మల్లయ్య, ఎల్లమ్మ, జల్లా గీతా, మాధురి, మజిర రెడ్డి,మంజుల రెడ్డి, బండి మమ్మీ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..