కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు…

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు…త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి..అందుకు గ‌ల కారణాలు:

1. అతి తెలివి
2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం.
3. అందరూ సమానమే అనే భావం పెరగడం.
4. పిల్లలు, పెద్దలు కూర్చొని మాట్లాడు కొనకపోవడం.
5. ఎక్కువ సమయం TV, ఫోన్లు,ఇతర net program లలో మునిగిపోవడం. ( ఎక్కడో ఉన్న సినిమా హీరో,హీరోయిన్లు ఏం తిన్నరో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ,ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)
6. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.
7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కుటుంబం అంతా చెదిరిపోవడం.
8. ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగా manage చేయలేకపోవడం.
9. భార్యాభర్తలు,తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు..
10. ఆర్థిక స్థితిగతులు,వ్యత్యాసాలు,పోలికలు,ఇలా అనేక విషయాలు కుటుంబ వ్వవస్థని ప్రభావితం చేస్తున్నాయి.
11. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం..జల్సాలు, జరుగుబాటుకోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.
12. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు.ఎవరిష్టానికి వారున్నారు.చెప్పినా నచ్చటం లేదు.
13.కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ.అది తెలియక పోవడం మరో కారణం.
14. మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది.భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు.”నేను”, “నేనే”, ” నేను చెపితే చేయాలి” అనే ధోరణి ప్రబలిపోయింది.
15.. social media నే అసలు, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు..ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నాలుగు వచ్చే పరిస్థితి ఉంటాదా?
ప్రజలంతా ఎవరికివారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు..ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి…
ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదు…🙏

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….