బుల్లితెరపై హుజూరాబాద్‌ జైత్రయాత్ర: ‘జబర్దస్త్’ వేదికపై కరీంనగర్ టీం సందడి!

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి 01:
కళలకు కాణాచి, అద్భుత ప్రతిభకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న మన హుజూరాబాద్ గడ్డ మరోమారు బుల్లితెరపై తన సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వినోద కార్యక్రమం ‘జబర్దస్త్’ వేదికపై మన ప్రాంతానికి చెందిన యువ కళాకారులు ‘కరీంనగర్ టీం’ పేరుతో నవ్వుల జల్లు కురిపిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చి, తమలోని అద్భుతమైన హాస్య చతురతతో జాతీయ స్థాయి వేదికపై రాణిస్తుండటం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హుజూరాబాద్‌కు చేరుకున్న ఈ టీం సభ్యులను బాచి ప్రాంక్ ఫేమ్, ప్రముఖ సామాజిక కార్యకర్త సమ్మెట సాయిరాం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ యువకులు స్వయంకృషితో పైకి వచ్చి, జబర్దస్త్ వంటి ప్రతిష్టాత్మక షోలో టీం లీడర్లుగా ఎదగడం మనందరికీ గర్వకారణమని కొనియాడారు. వారి కృషికి స్థానిక ప్రజల ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
నవ్వుల నావలో మన వారు..
ఈ బృందంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారంతా మన ప్రాంత వాసులే కావడం విశేషం. హుజూరాబాద్‌కు చెందిన కమల్ సింగ్ టీం లీడర్‌గా వ్యవహరిస్తూ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే సిరిసపల్లికి చెందిన చొప్పరి అనిల్, హుజూరాబాద్‌కు చెందిన పుడారి ప్రసాద్ తమ విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ జిల్లా పేరును రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిస్తున్నారు.
ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీ (ETV) ఛానల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో మన ‘కరీంనగర్ టీం’ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనుంది. మన ప్రాంత కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వారిని మరింత ప్రోత్సహించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. వీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి వెండితెరపై కూడా వెలిగిపోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు గర్జనతో సర్కారును గద్దిస్తాం: పోలాడి రామారావు… ఈనెల 28న కరీంనగర్‌లో 2 లక్షల మందితో ‘సమరభేరి’ …అరకొర రుణమాఫీ, రైతు భరోసా ఎగవేతపై ధ్వజం ..హుజూరాబాద్‌లో సన్నాహక సమావేశం.. గోడప్రతుల ఆవిష్కరణ…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !